కురుమ సంఘం హనుమకొండ జిల్లా కన్వీనర్ గా చేవెల్ల మల్లయ్య

హర్షం వ్యక్తం చేసిన రంగయ్యపల్లి గ్రామస్తులు

On
కురుమ సంఘం హనుమకొండ జిల్లా కన్వీనర్ గా చేవెల్ల మల్లయ్య

కురుమల అభివృద్ధి కోసం కృషి చేస్తా- మల్లయ్య

భీమదేవరపల్లి ఏప్రిల్ 14 (ప్రజామంటలు) :

తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ముత్త సంపత్ ఆదేశానుసారం భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన చేవెల్ల మల్లయ్యను హనుమకొండ జిల్లా కన్వీనర్ గా నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కురుమ కులంపై అభిమానంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, సంఘానికి, కురుమ సమాజానికి చేస్తున్న సేవలు, కృషిని గుర్తించి వారిని కురుమ సంఘం హనుమకొండ జిల్లా కన్వీనర్ గా నియామకం చేస్తూ ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ, కురుమ కుల సంఘం అభివృద్ధి కోసం విస్తృతంగా అభివృద్ధిలో భాగం చేస్తూ అందరి పక్షాన న్యాయం జరిగేలా చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో, తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు, భీమదేవరపల్లి మండల కురుమ సంఘం నాయకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.

Tags