జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ లో పాల్గొన్న విద్యార్థులను ప్రశంసించిన ఎస్.కె.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఏప్రిల్ 19 (ప్రజా మంటలు) :
స్థానిక ఎస్.కె.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలో పాల్గొని వచ్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. అరిగెల అశోక్, చారిత్రిక ఉపన్యాసకులు & జిజ్ఞాస ప్రాజెక్ట్ పర్యవేక్షకులు డా. వి. రాజేశం, జిజ్ఞాస కో ఆర్డినేటర్ డా. డి. ప్రకాష్ మరియు అధ్యాపక బృందం ప్రశంసించారు.
తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కేవలం ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే నిర్వహించే పోటీ కార్యక్రమం " జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ ".
ఇందులో అన్ని కళాశాలల విద్యార్థులు కళాశాల స్థాయిలో పోటీ పడి కొందరు మాత్రమే రాష్ట్రస్థాయి పోటీకి ఎంపిక చేయబడినారు.
అలా ఎస్.కె.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి చరిత్ర విభాగంలో అయిదుగురు విద్యార్థుల బృందం
- జే. సందీప్.
- ఏ. రఘు.
- ఎం. ప్రణయ్.
- కే. ఉపేందర్.
- జే. ఉదయ్.
విద్యార్థులు " జిజ్ఞాస ప్రాజెక్ట్ " రాష్ట్రస్థాయి పోటీకు " ఏ కంపరేటివ్ స్టడీ ఆఫ్ కెరీర్ ఆస్పిరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ బి.ఏ, బి.జెడ్.సి ఆఫ్ ఎస్.కె.ఎన్.ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ జగిత్యాల " అనే శీర్షిక తో ఎన్నికై ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ లో పాల్గొని వచ్చారు.