పట్టణంలోని వివిద ప్రాంతాలలో ఇండ్లల్లో దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తుల అరెస్టు.

- రూ. 66,700 నగదు, 8 తులాల వెండి స్వాధీనం : డిఎస్పీ రఘుచందర్

On
పట్టణంలోని వివిద ప్రాంతాలలో ఇండ్లల్లో దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తుల అరెస్టు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

 జగిత్యాల మే 2 (ప్రజా మంటలు) : 

గత కొన్ని రోజుల నుండి జగిత్యాల పట్టణంలోని వివిద ప్రాంతాలలో ఇండ్లల్లో దొంగతనానికి పాల్పడ్డ విబూది శేఖర్ మరియు గుమ్మాల వెంకటేష్ అనే ఇద్దరిని గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని విచారించి, వారినుండి 66,700 రూ.నగదు, 8 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ రఘుచందర్ వెల్లడించారు.

గురువారం రాత్రి 7-30 గంటల ప్రాంతంలో టౌన్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జగిత్యాల చిన్న కెనాల వద్ద జగిత్యాల టౌన్ పోలీస్ వారు వాహనాలు తనిఖీ చేస్తూండగా, ఆ సమయం లో అటువైపు వస్తున్న నిందితులు విబూది శేఖర్ మరియు గుమ్మాల వెంకటేష్ లు పోలీసులను చూసి పారిపోతూ ఉండగా...గమనించిన పోలీసులు వారిద్దరినీ పట్టుకొని విచారించడం జరిగిందని వివరించారు.

మొత్తం ఏడు కేసులలో నేరం చేసినట్లు వారు నేరంలను ఒప్పుకోగా... విభూది శేఖర్ వద్ద నుండి 55,700/- మరియు వెంకటేష్ వద్ద నుండి 11,000/ రూపాయలు మరియు 8 తులాల వెండిని స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకుని విచారించి, అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చడం జరిగిందని డిఎస్పీ రఘుచందర్ వెల్లడించారు.

Tags