మైనర్ కొడుకు చేసిన తప్పుకు తల్లి ప్రాణాలు బలి కేసులో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు
On
మైనర్ కొడుకు చేసిన తప్పుకు తల్లి ప్రాణాలు బలి
కేసులో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు. హైదారాబాద్ ఫిలింనగర్ లో విషాదం.
హైదారాబాద్ ఏప్రిల్ 19:
బైక్ నడుపుతూ బీఎండబ్ల్యు కారుని ఢీకొట్టిన మైనర్ (14) బాలుడు కారు మరమ్మతుల కోసం రూ.20 వేలు ఇవ్వాలని డ్రైవర్స్ డిమాండ్.డబ్బులు ఇవ్వకుంటే మైనర్ డ్రైవింగ్ కేసు పెడతాం అంటూ హెచ్చరికలు.
చేతిలో చిల్లి గవ్వ లేదని కొడుకు జైలుకు వెళ్తాడనే మనస్తాపంతో ఉరేసుకుని తల్లి సూర్య కుమారి(35) ఆత్మహత్య.
భర్త ఫిర్యాదుతో ఇద్దరు డైవర్ల మీద ipc 306 సెక్షన్ కేసు కింద కేసు నమోదు.
చంద్ర శేఖర్, మహేష్ అనే ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.
తమ కారుకి డామేజ్ అయితే యజమాని ఊరుకోడు కదా అంటూ కన్నీళ్ళ పర్యంతం అవుతున్న డ్రైవర్లు.
తమ మీద కేసు పెడితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయి అంటూ అవేదన. .కేసు దర్యాప్తు చేస్తున్న ఫిలిం నగర్ పోలీసులు
Tags