ఎంపీ ఈటలకు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలి

సికింద్రాబాద్, ఏప్రిల్ 09 (ప్రజామంటలు):
మల్కాజిగిరి ఎంపీ,సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ కు తెలంగాణ రాష్ర్ట భారతీయ జనతా పార్టీ అద్యక్ష పదవిని ఇవ్వాలని కోరుతూ అఖిల భారత ముదిరాజ్ కోలి సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు పార్టీ అగ్రనాయకులను కోరారు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, బడుగు బలహీన వర్గాల ప్రజల నాడీ తెలిసిన ఈటల రాజేందర్ రాష్ర్ట బీజేపీ సారథి పోస్టుకు అన్ని విధాలా అర్హుడని ఆయన పేర్కొన్నారు. రెండు సార్లు రాష్ర్ట కేబినేట్ మంత్రిగా, ముఖ్యంగా కరోనా పాండమిక్ సమయంలో హెల్త్ మినిస్టర్ గా ప్రాణానికి తెగించి రాష్ర్టానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట సాధనలో ఈటల రాజేందర్ పాత్ర చిరస్మరణీయమన్నారు. రాష్ర్ట జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి ఈటల రాజేందర్ కు రాష్ర్ట బీజేపీ ప్రెసిడెంట్ పోస్టును ఇస్తే , ముదిరాజ్ లకు సరైన గౌరవం దక్కినట్లు తమ కమ్యూనిటీ భావిస్తుందని అన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూప్ లు, కాని పక్షపాతం గాని చూపకుండా, అందరిని ఒకే విదంగా చూస్తూ, అందరితో మమేకంగా వ్యవహరించే ఈటల రాజేందర్ కు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పోస్టును ఇవ్వాలని పొట్లకాయల వెంకటేశ్వర్లు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లకు బుధవారం పంపిన లేఖ లో కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.

గుడుంబా తయారీదారులనుండి రక్షించండి - బాధితుల ఫిర్యాదు

దేశం పరువు తీయడం రాహుల్ కు అలవాటే... రాహుల్ ఓ రాజకీయ అజ్ఞాని

గ్రేటర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలి... ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్పార్టీయే

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

ఇండ్లపై విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ

సమకాలీన ప్రపంచంలో సాంకేతికతను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలి ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
