నరసింహుని సన్నిధిలో దేవాదాయ కమిషనర్ హన్మంత రావు

On
నరసింహుని సన్నిధిలో దేవాదాయ కమిషనర్ హన్మంత రావు

నరసింహుని సన్నిధిలో దేవాదాయ కమిషనర్ హన్మంత రావు

(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఏప్రిల్ 23:
ధర్మపురి  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని మంగళ వారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్ ఎం. హనుమంతరావు దర్శించుకున్నారు .
 దేవస్థానం సాంప్రదాయ ప్రకారం ఈఓ శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది 
 పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికారు. ఆయన పేరున గోత్ర నామ యుక్త ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేదపండితులు అర్చకులు ఆశీర్వచనం గావించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, ముఖ్య అర్చకులు నుంభి శ్రీనివాసాచార్యులు, మరియు సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు. అనంతరం కమీషనర్ హన్మంత రావు దేవస్థానంలో భోజనం చేశారు. భోజనం గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.

Tags