వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్.
On
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
సారంగాపూర్ /బుగ్గారం ఏప్రిల్ 22 (ప్రజా మంటలు )
నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు.
సోమవారం రోజున సారంగాపూర్, బుగ్గారం మండలాల్లోని యశ్వంత్ రావుపేట , బట్టపల్లి, పోతారం గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.....
రైతుల నుండి కొనుగోలు చేసే వరి పంటను నాణ్యత గల వరి ని కొనుగోలు చేయాలని కేంద్రం ఇంఛార్జి లను ఆదేశించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్ లను అదనపు కలెక్టర్ పరిశీలించారు.
కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో నీడ ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.
ఆయన వెంట ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ , తదితరులు ఉన్నారు.
Tags