కొనసాగుతున్న మానవుని జీవితములో శ్రీ రాముడు అంశముపై ప్రవచనం.

On
కొనసాగుతున్న మానవుని జీవితములో శ్రీ రాముడు అంశముపై ప్రవచనం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/934842213)

జగిత్యాల ఏప్రిల్ 22 ( ప్రజా మంటలు ) : 

స్థానిక అభయాంజనేయ ఆలయములో నంబి వేణుగోపాలాచార్య చే మానవుని జీవితంలో శ్రీరాముడు అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు.

భక్తుల అనుగ్రహ భాషణం చేస్తూనంబి వేణుగోపాల ఆచార్య ప్రవచనములో దశరథుడు పుత్ర కామేస్టి వ్రతం రామ లక్ష్మణ భరత శత్రజ్ఞుల జననం యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను పంపమని విశ్వామిత్రుడు దశరథుని అడుగుట యాగ సంరక్షణలో భాగంగా తాటక వద సుబాహు వధ తదితర అంశాలు ప్రవచించారు. స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మూడు రోజులపాటు మానవుని జీవితములో శ్రీ రాముడు అన్న అంశముపై ప్రవచన కార్యక్రమం సాయంత్రం సైతం కొనసాగింది.

సోమవారం రెండవ రోజు కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

Tags