ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం చైర్మన్ గా డా. బి ఎం .వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా మంద. భీమ రెడ్డి

On
ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం చైర్మన్ గా డా. బి ఎం .వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా మంద. భీమ రెడ్డి


హైదరాబాద్ ఏప్రిల్ 10 (ప్రజా మంటలు)
 సంవత్సరం లోగా ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.

 గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం. 

 కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే.  

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు... గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం చేయడానికి అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జి.ఓ. విడుదల చేశారు. రెండేళ్ల కాలపరిమితి గల ఈ కమిటీ చైర్మన్ గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డి లను నియమించారు. జిఎడి ప్రోటోకాల్, ఎన్నారై విభాగానికి చెందిన జాయింట్ సెక్రెటరీ స్థాయి ఐఏఎస్ అధికారి కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. 

కమిటీలో గౌరవ సభ్యులుగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ లను నియమించారు.

గల్ఫ్ వలసలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగిన ప్రవాసీ కార్మిక నాయకులు  సింగిరెడ్డి నరేష్ రెడ్డి, డా. లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాస రావు, కొట్టాల సత్యంనారా గౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల లను కమిటీ సభ్యులుగా నియమించారు. 

సీఎం హామీ నేపథ్యంలో... 

గత సంవత్సరం ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ తాజ్ దక్కన్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

గల్ఫ్ తదితర గమ్యస్థాన దేశాలలోని అల్పాదాయ తెలంగాణ వలస కార్మికులకు ఆయా దేశాలలో లభిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దేశంలోని కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రవాసీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కారాలను కనుగొనడానికి ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శిస్తుంది. 

ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా... సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) రూపకల్పన తో పాటు, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ తదితర దేశాల్లోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమ బోర్డు) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. 

Tags

More News...

Local News 

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన  ఎమ్మెల్యే డా సంజయ్

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన  ఎమ్మెల్యే డా సంజయ్                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 9348422113 జగిత్యాల మే 4(ప్రజా మంటలు    )అర్బన్ మండలం తిప్పనపేట గ్రామానికి చెందిన నల్వాల నరసయ్య మరియు జగిత్యాల పట్టణ 30వ వార్డుకు చెందిన ఎండి అయాన్ అహ్మద్ ఇటీవల  కరెంటు షాక్ తో మరణించగా ఒక్కొక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 50 వేల చెక్కును, 4...
Read More...
Local News 

పాము కాటు బాధితుని  ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు

పాము కాటు బాధితుని  ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ బీర్పూర్ మే 4 (ప్రజా మంటలు)పాము కాటు బాధితుని ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్నారు బీర్పూర్ పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి.నిర్మల్ జిల్లా కి చెందిన గణపతి బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోల్ల వాగు దగ్గర పీతలు పట్టడానికి వచ్చి పాముకాటుకు గురికాగా అర్ధరాత్రి సమయంలో డయాల్...
Read More...
Local News 

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్   - తప్పిన పెను ప్రమాదం

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్   - తప్పిన పెను ప్రమాదం సికింద్రాబాద్, మే 03 (ప్రజామంటలు):శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బౌద్దనగర్ డివిజన్ లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ దారిలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కు సంబందించిన సెంట్రింగ్ గాలివానకు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా కుప్పకూలింది. దాంతో అక్కడున్న కరెంట్, వైఫై తదితర తీగలు తెగిపోయాయి. సెంట్రింగ్ కట్టెలు,...
Read More...

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                                                 సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల మే 3 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లో బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు జిల్లా కోర్టును సందర్శన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కోర్టు కు అవసరమైన మౌలిక సదుపాయాలు ,నూతన కోర్టు ,కోర్టు హాల్,నూతన పోస్టుల,అడ్వకేట్...
Read More...
Local News 

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి                                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 3(ప్రజా మంటలు)  *అభ్యర్థులు  పరీక్షా కేంద్రాలకు పెన్నులు,పెన్సిళ్లు తీసుకురావొద్దు* *పరీక్షా కేంద్రంలోనే అభ్యర్థులకు పెన్నులు అందజేత*   *ఈ నెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష పై అభ్యర్థులకు  పలు సూచనలు చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.* ఈ నెల 4వ తేదీన(ఆదివారం)నీట్ పరీక్ష...
Read More...
Local News 

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్    - ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి జగిత్యాల ఏప్రిల్ 03:  తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు 2019 లో నిర్వహించిన సమ్మె కాలం నాటి అక్రమ కేసులను ఈ ప్రభుత్వం ద్వారా ఎత్తివేయించాలని ప్రముఖ ఉద్యమ కారులు మహంకాళి రాజన్న, చుక్క గంగారెడ్డి లు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు శనివారం విజ్ఞప్తి...
Read More...
Local News 

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు                                                     సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 3(ప్రజా మంటలు)  పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 34 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామచంద్రం ను జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి...
Read More...

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న 

పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్  కన్వీనర్ చాంద్ పాషా  సూటి ప్రశ్న  విదేశాల్లో ఉన్న వారిని రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం ఆగని ఏజెంట్ల మోసాలు - ఆగిపోయిన కేంద్ర సేవలు టిపిటిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా హైదరాబాద్ ఏప్రిల్ 02: గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించడం విఫలం అయిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక...
Read More...

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు జగిత్యాల మే 02 (ప్రజా మంటలు) శ్రీ ఆదిశంకరాచార్య శ్రీమాన్ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో జయంతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్ల చిత్రపటాలకు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పం, నిర్వహించి స్వామి వార్ల జీవిత విశేషాలను...
Read More...
Local News 

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక సికింద్రాబాద్, మే 02  (ప్రజామంటలు): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో  రికగ్నైజ్ గుర్తింపు కలిగిన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కాశపాగా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి కార్మికులకు వృత్తిపరంగా ఎటువంటి సమస్యలు, అన్యాయం జరిగిన అ సమస్యకు పరిష్కార దిశగా న్యాయబద్ధ పోరాటం చేసి బాధితులకు...
Read More...
Local News 

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

వాసవిక్లబ్  ఆధ్వర్యంలో మజ్జిగ  ప్యాకెట్లు పంపిణీ సికింద్రాబాద్, మే 02 (ప్రజామంటలు): వాసవిక్లబ్ ప్రతినిధి బి.లక్ష్మీ వివేకానంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొండాపూర్ లోని ఆదిత్యా హైట్స్ వద్ద ఉన్న చలివేంద్రంలో వందలాది మందికి మజ్జిగ ను పంపిణీ చేశారు. వాసవిక్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాసవిక్లబ్ ప్రెసిడెంట్ మ్యాడం చంద్రశేఖర్, ప్రతినిధులు విద్యా సంకల్స్ గోలి జగదీశ్వర్, ఆదిత్యా...
Read More...
State News  Spiritual  

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు(రామ కిష్టయ్య సంగన భట్ల...        9440595494) "భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర" అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో... భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా...
Read More...