మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి

కాంగ్రెస్ 14 లోక్ సభ స్థానాలలో జెండా ఎగరవేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసిన నాయకులు

On
మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి

భీమదేవరపల్లి ఏప్రిల్ 09 (ప్రజామంటలు)

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బిసి రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు అత్యధిక లోకసభ స్థానాలను తెలంగాణ రాష్ట్రం నుంచి బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పాంచ్ న్యాయ్, పచాస్ హామీతో పాటు మరెన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉందని పేర్కొన్నారు.

Tags