కోరుట్ల మండలం పలు గ్రామాల్లో మోడీ అభివృద్ధి పథకాలు వివరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి.

On
కోరుట్ల మండలం పలు గ్రామాల్లో మోడీ అభివృద్ధి పథకాలు వివరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

కొరుట్ల ఏప్రిల్ 13 (ప్రజా మంటలు )

శక్తి వందన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ తో పాటు పలు గ్రామాల్లోల స్థానిక మహిళలతో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు పథకాల గురించి వివరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా.బోగ శ్రావణి

ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ....

ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల గ్యాస్ కనెక్షన్, కిసాన్ సమ్మన్ యోజన మరియు ఆయుష్మాన్ భారత్ వంటి అనేక అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా అనేకమంది నిరుపేదలు లబ్ధి పొందుతున్నారు,మరియు స్ట్రీట్ వెల్డింగ్ లోన్స్ కానీ మద్రాస్ లోన్స్, పిఎం ఈజిపి వంటి లోన్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారు మరియు నిజామాబాద్ కి పసుపు బోర్డును తీసుకువచ్చి పసుపు రైతుల కష్టాలను తీర్చిన ఘనత మన ఎంపీ అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ గారు, అదే విధంగా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్, రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి బాబు, కోరుట్ల మండల అధ్యక్షులు పంచిరి విజయకుమార్, యూసుఫ్ నగర్ సర్పంచ్ గుగ్గిళ్ళ తుకారం గౌడ్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు అంబల్ల సుదర్శన్, బీజేవైఎం మండల అధ్యక్షులు వెంకటరెడ్డి రాజు, జిల్లా కిసాన్ మోర్చ్ కార్యదర్శి మల్లారెడ్డి, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు ఏలేటి రాజు, ప్యాక్స్ డైరెక్టర్ ఏలేటి లింగారెడ్డి,బూత్ అధ్యక్షులు భూమానందం, సుధాకర్ మరియు మహిళలు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags