వివాహితను బ్లాక్మెయిల్ తో అత్యాచారం.

- బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు రిమాండ్ కు తరలింపు

On
వివాహితను బ్లాక్మెయిల్ తో అత్యాచారం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 7 (ప్రజా మంటలు)

కోటగిరి మోహన్ s/o సిద్ది రాములు , వ: 39 సంవత్సరాలు, కులం: వైశ్య, వృత్తి: వ్యాపారం, r/o TR నగర్ జగిత్యాలకు చెందిన నేరస్థుడు

గత కొంత కాలంగా జగిత్యాల పట్టణం లో నివసిస్తున్న ఒక వివాహితను జనవరి నెలలో ఎగ్జిబిషన్లో పనిచేస్తున్నప్పుడు పరిచయం చేసుకుని ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గర అయి మరియు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు మొబైల్ లో తీసుకుని తర్వాత అతని కోరిక తీర్చమని అడిగినప్పుడు అతని మాట విననప్పుడల్లా అట్టి ఫోటోలను సోషల్ మీడియా లో పెడుతానని బెదిరిస్తూ ఆమెను బలవంతంగా అత్యాచారం చేసినాడు.

నేను ఎవరికి బయపడను పోలీస్ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని కూడాని బెదిరించాను. నా మీద చాలా కేసులు వున్నాయి నన్ను ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు అంటూ ఆమెను బెదిరిస్తూ తనకు అవసరం ఉన్నప్పుడల్లా బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెను బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. అని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ అనంతరం పై నేరస్తున్ని రిమాండ్ కు తరలించనైనది. ఇప్పటి వరకు ఈ నేరస్తుని పైన జగిత్యాల టౌన్ పి.యస్ లో 6 కేసులు ,జగిత్యాల రూరల్ పి.యస్ లో 5 కేసులు మరియు కోడిమ్యాల పి.యస్ యందు ఒక కేసు మొత్తం 12 కేసులు ఉన్నాయి.

Tags